ఉమ్మడి . బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వరద నీటితో చెరువులను తలపించాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ధాటికి పలుచోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. కోట్పల్లి, లక్నాపూర్, జంటుపల్లి ప్రాజెక్టులు అలుగుపారుతుండడంతో ఆయకట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లిలో 40.2మి.మీ, వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట మండల కేంద్రంలో 7.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కురుస్తున్న వర్షానికి జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత వర్షాలు మెట్ట పంటలకు ఎంతో మేలని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులూ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ముఖం చాటేసిన వరుణుడు చాలా రోజుల తర్వాత కరుణించాడు. వాడిపోయే దశలో ఉన్న పంటలకు జీవం పోశాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణా లు, పల్లెల్లోని లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా సైతం స్తంభించింది. అత్యధికంగా శంకర్పల్లిలో 40.2 మి.మీటర్ల వర్షపాతం నమోదవ్వగా జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లోనూ ఆశించిన మేరలో వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు మేలు చేకూర్చడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
జిల్లాలో గత రెండు రోజులుగా కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే జిల్లా సగటున 18.4 మి.మీటర్లు, జిల్లావ్యాప్తంగా 497.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. శంకర్పల్లిలో అత్యధికంగా 40.2మి.మీటర్లు, కొందుర్గ్గులో 34.5 మి. మీ, శేరిలింగంపల్లిలో 29.4, చౌదరిగూడెంలో 29.3, శంషాబాద్లో 26.8, చేవెళ్లలో 25.7, మహేశ్వరంలో 24.3, గండిపేటలో 22.5, హయత్నగర్లో 19.8, సరూర్నగర్, మొయినాబాద్లలో 19.7, బాలాపూర్లో19.3, అబ్దుల్లాపూర్మెట్ 19.2, షాబాద్లో 18.4, ఫరూఖ్నగర్లో 18.2, ఇ బ్రహీంపట్నంలో 17.7, రాజేంద్రనగర్లో 16.5, నం దిగామలో 15, మంచాలలో 13.9, కేశంపేటలో 12.9, కొత్తూరులో 10.8, ఆమనగల్లులో 9.5, యాచారంలో 9.4, కడ్తాల్లో 7.3, మా డ్గులలో 3.9, తలకొండపల్లిలో 3.0మి. మీటర్ల వర్షపాతం నమోదైంది.
జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో రైతులు వానకాలం పంటల సాగును ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో వరి-92,225 ఎకరాల్లో, జొన్నలు-2,358 ఎకరాల్లో, మొక్కజొన్న- 55,923, కందులు- 9,626, పత్తి-1,30,968, ఇతర పంటలను 9,772 ఎకరాల్లో సాగు చేశారు. మరో 5,407 ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలు సాగవుతున్నాయి. పంట లు ఏపుగా పెరుగుతున్న దశలో వర్షాలు ముఖం చాటేశాయి. పంటలు ఎండుముఖం పడుతుండడంతో రైతాంగం ఆం దోళన చెందుతున్నది. ఈ క్రమంలో వరుణుడి కరుణకోసం రైతాంగం ఎదురుచూస్తుండగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పం టలకు ప్రాణం పోసినైట్లెందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఈ వానకు మూసీ, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. కోట్పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి , శివసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మా రి అలుగులు పారుతున్నాయి. మరోవైపు దోర్నాల్, మద్గుల్ చిట్టంపల్లి తదితర వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. వికారాబాద్, మోమిన్పేట మండలాల్లో రికార్డు వర్షపాతం నమో దైంది. మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో జిల్లా కేంద్రంలోని రోడ్లు, కాలనీలు వరద నీటితో చెరువులను తలపించాయి. కలెక్టరేట్ వెళ్లే మధ్యలో వరద ప్రవాహం ధాటికి రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
అదేవిధంగా మోమిన్పేట, నవాబుపేట మండలాల్లోనూ కురిసిన భారీ వర్షానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అత్యధికంగా మోమిన్పేట మండలంలో 7.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ మండలంలో 7.4 సెం.మీట ర్లు, నవాబుపేట మండలంలో 7.3 సెం.మీటర్లు, పూడూరు మండలం మన్నెగూడలో 5.3 సెం.మీటర్లు, పరిగి మండలంలో 4.6 సెం.మీటర్లు, కులకచర్ల మండలంలో 4.2 సెం.మీటర్లు, చౌడాపూర్లో 3.6 సెం.మీటర్లు, కోట్పల్లి మండలంలో 3.6 సెం.మీటర్లు, ధారూరు మండలంలో 3.4 సెం.మీటర్లు, మర్పల్లి మండలంలో 3.3 సెం.మీటర్లు, బొంరాస్పేట మండలంలో 3.2 సెం.మీటర్లు, యాలాల మండలంలో 3 సెం.మీటర్లు, బషీరాబాద్ మండలంలో 2.7 సెం.మీటర్లు, బంట్వారం మండలంలో 2.4సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.