శంకర్పల్లి, ఫిబ్రవరి 25 : ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 – 5 వయస్సులోపు పిల్లలకు మండలంలో 4022 మంది ఉన్నారన్నారు. వీరికి 36 బూత్ల ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేస్తామన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 4 రూట్లలో మొబైల్ టీమ్ తిరిగేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
షాబాద్, ఫిబ్రవరి 25 : ఈ నెల 27వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షాబాద్ ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి ఇందిరా ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలో వైద్య సిబ్బంది, ఆశ వరర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 27వ తేదీ గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి చిన్నారులకు పల్స్ పోలియో చుకలు వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ కురుమ శంకర్, హెల్త్ అసిస్టెంట్ గోపాల్, వైద్య సిబ్బంది, ఆశవరర్లు పాల్గొన్నారు.
యాచారం, ఫిబ్రవరి25: ఈనెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వైద్యాధికారి ఉమాదేవి అన్నారు. పల్స్పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల కేంద్రంలో శుక్రవారం ఆశవర్కర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఈవో శ్రీనివాస్, దవాఖాన సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.