వికారాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): చెరువు రైతులకు బతుకుదెరువుగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకంతో జిల్లాలోని చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. కాకతీయుల నుంచి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన సంపదలో చెరువులు ప్రధానమైనవి. అయితే పరిపాలన నిర్వహణలో గత ప్రభుత్వాలు చెరువులను గాలికొదిలేశాయి. అంతేకాకుండా ప్రత్యామ్నా య నీటి వనరులను సృష్టించడంలోనూ నిర్లక్ష్యం చేయడంతో గ్రామాల్లో వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. అంతేకాకుండా చాలా చెరువులు కబ్జాలకు గురికావడంతోపాటు నామరూపాల్లేకుండాపోయాయి. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకంతో రైతాంగం లో కొత్త ఆశలను చిగురించేలా చేశారు. కబ్జాలకు గురైన చెరువులు, నామరూపాల్లేకుండా పోయిన చెరువులకు తిరిగి జీవం పోశారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడికతీతతోపాటు మరమ్మతులు చేపట్టడంతో జిల్లావ్యాప్తంగా దా దాపు 70వేల ఎకరాలకుపైగా సాగునీరం దిం చేలా చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. అంతేకాకుండా భూగర్భజలాలు పెరగడంతోపాటు సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరిగింది. మరోవైపు జిల్లావ్యాప్తంగా 1,207 చెరువులుండగా 78,091 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది.
‘మిషన్ కాకతీయ’తో పెరిగిన నీటి నిల్వలు
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులతో కృష్ణా జలాల్లో మన వాటా జలాలను మనం వాడుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో మొదటి, రెండు, మూడు, నాలుగు విడుతల్లో చేపట్టిన పూడికతీత పనులతో కనీసం 5 టీఎంసీలకు పైగా వృథాగా పారే కృష్ణా జలాలను ఒడిసి పట్టే అవకాశం కలుగుతుంది. గతంలో చెరువు లు, కుంటలు పాడైన స్థితిలో ఉండి వాటిలో సగం నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీరు ఎక్కువగా నిల్వ అయ్యేది కాదు. కట్టలకు పలు చోట్ల గండ్లు, తూములకు లీకేజీలతోపాటు అలుగులు పాడవడం వల్ల కురిసిన వర్షం నీరు ఎక్కువగా వృథాగా పోయేది. అయితే దాదాపు అన్ని చెరువులకు మరమ్మతులు చేపట్టడంతో చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి. ఫలితంగా గత నాలుగైదు ఏండ్లుగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం భారీగా పెరిగింది. పూడికతీతతో ఒక వైపు రైతుల పంట పొలాలు సారవంతంగా మారాయి. గతంలో సగటున 20-30 ఎకరాలకు నీరందించే చెరువు మిషన్ కాకతీయ పనులతో 120 -130 ఎకరాలకు నీరందించే స్థితికి చేరుకున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి చెరువుల్లో పూడిక తీత పనులవల్ల కనీసం 500 మిలియన్ క్యుబిక్ ఫీట్ల (5 టీఎంసీల)వృథాగా పారే కృష్ణా జలాలు చెరువుల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు చెరువులకు ప్రస్తుతమున్నది.
అంతేకాకుండా మిషన్ కాకతీయ పనులతో జిల్లాలోని చెరువులు వేసవిలోనూ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. మండు వేసవిలోనూ జిల్లాలోని దాదాపు వెయ్యికిపైగా చెరువుల్లో 90 శాతం మేర నీ టి నిల్వలుండటం గమనార్హం. మరోవైపు చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భజలాలు పెరుగడంతో ఆయా పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2014 అక్టోబర్లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా చెరు వుల పూడికతీత పనులతో ప్రస్తుతం జిల్లాలో 5,88,977 ఎకరాలకు ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా పరిధిలో మొత్తం 1,207 చెరువులు, కుంటలుండగా 77,538 ఎకరాల ఆయకట్టు ఉన్నది. నాలుగు విడుతల్లో 790 చెరువులకు దాదాపు రూ. 246 కోట్ల 95 లక్షల నిధులతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. మొదటి విడుతలో 241 చెరువులకు రూ.83 కోట్ల 34 లక్షలు, రెండో విడుతలో 265 చెరువులకు రూ.118 కోట్ల 33 లక్షలు, మూడో విడతలో 129 చెరువులకు రూ.29 కోట్ల 52 లక్షలు, నాల్గో విడుతలో 165 చెరువులకు రూ.17 కోట్ల 76 లక్షల నిధులను ప్రభుత్వం ఇచ్చింది. నాలుగు విడుతల్లో కలిపి దాదాపు 70 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరందించేలా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు.
నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది
బొంరాస్పేట పెద్ద చెరువులో ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన పూడికను మిషన్ కాకతీయ పథకం ద్వారా తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం భారీగా పెరిగింది. గతేడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో చెరువు నిండి అలుగు పారింది. వర్షాకాలంలో పంటలు సాగు కాగా.. యాసంగికీ కూడా చెరువులో పుష్కలంగా నీళ్లున్నాయి. దీంతో యాసంగిలోనూ చెరువు కింద ఆయకట్టులో వరిని సాగు చేస్తున్నాం. మిషన్ కాకతీయ పనులతో చెరువు లోతు పెరిగి నీటినిల్వ సామర్థ్యం పెరగడమే కా కుండా కాలువలను కూడా బాగు చేశారు. ప్రభు త్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం నీటి వనరుల అభివృద్ధికి ఎంతో తోడ్పడింది. –కోడిగంటి మల్లప్ప, రైతు, బొంరాస్పేట
చెరువుల్లో నీళ్లు పుష్కలం
ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో వేస వి కాలంలోనూ చెరువు ల్లో పుష్కలంగా నీరు ఉన్నది. చెరువుల పునరుద్ధ్దరణతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. గతంలో వర్షాలకు చెరువుల్లో చేరిన నీరు చెరువు కట్టలు, తూములు సక్రమంగా లేకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లే బయటికి వెళ్లేది. కానీ.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో ప్రస్తుతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతం గా ఉన్నాయి. – బైరం కృష్ణయ్య, రైతు, లింగంపల్లి,
కులకచర్ల మండలం