పరిగి : అహింసా మార్గంలో దేన్నయినా సాధించవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్ముడి బాటలో అహింసా పద్ధతిలో ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహాత్ముడు చూపిన బాటలో నడవాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం మహాత్ముడి మార్గదర్శనంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్గుప్తా, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్. భాస్కర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆకారపు రాజు, రమేశ్, వీరేశం, కౌన్సిలర్లు ఎదిరె క్రిష్ణ, నాగేశ్వర్, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్, సేవ్యానాయక్, హాజీ అమిరొద్దీన్ పాల్గొన్నారు.