పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేవి ముగ్గులని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రాఘవాపూర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు ప్రతిమారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పిల్లలకు మన సంస్కృతిని తెలియజేయాలని, ఆచరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్ హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.