పరిగి, అక్టోబర్ 28: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు భరోసా కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం పరిగి పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా నిలిచిందని, ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ది చేకూర్చిందని చెప్పారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయంతో సీఎం కేసీఆర్ భరోసా కల్పించారన్నారు.
ఇబ్బందులలో ఉన్న వ్యవసాయరంగాన్ని పండుగలా మార్చేందుకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు సంవత్స రానికి రూ.10వేలు అందించడంతోపాటు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 16 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతరులకు రూ.200 నుంచి పింఛన్ను రూ.2016కు పెంచారని, దివ్యాంగులకు రూ.4016కు పెంచిన సీఎం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. 24గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చారని చెప్పారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలు దూరం చేస్తూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.
వంటగ్యాస్ సిలిండర్ను రూ.400లకే ఇస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో చెప్పిన ప్రతి హామీ నెరవేర్చారని, ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలు సైతం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో సైతం ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాం సుందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, సయ్యద్పల్లి సర్పంచ్ వెంకట్రామకృష్ణారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు మునీర్, వేముల కిరణ్, ఎదిరె కృష్ణ, వెంకటేశ్, వారాల రవీంద్ర, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పరిగి ఎమ్మెల్యేగా మహేశ్రెడ్డిని మరోసారి గెలిపిం చాలని ఆయన సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి కోరారు. శనివారం పరిగి పట్టణంలోని 13, 14 వార్డులలో ప్రతిమారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత అయిదేళ్లలో పరిగి అభివృద్ధికి మహేశ్రెడ్డి కృషి చేశారని వివరించారు. సుమారు రూ.40కోట్లు పరిగి పట్టణాభివృద్ధికి మంజూరు చేయించడంతోపాటు పనులు వివిధ దశలలో కొనసాగు తున్నాయని తెలిపారు. మరోసారి గెలిపిస్తే పరిగిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాహెర్అలీ, అన్వర్హుస్సేన్, మేదరి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ, అనూష, నాయకులు పాల్గొన్నారు.