పరిగి : సీఎం కేసీఆర్ రైతుబంధువు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సహాయంగా రూ. 50వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం పరిగిలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్ ఆధ్వర్యంలో రైతుబంధు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్లు, మొక్కజొన్నలతో ‘రైతుబంధు’కు 50వేల కోట్లు అని అక్షరాలలో రాసి వివిధ పూలతో అలంకరించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తలపాగా, భుజాన నాగలితో రైతుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఆదర్శ రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, మాజీ మార్కెట్ చైర్మన్ భాస్కర్గుప్తా, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.