బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ‘మనఊరు-మనబడి’ ‘మనబస్తీ-మనబడి’ అంశంపై మంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా చేయాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి పనులు త్వరగా పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈఈ గోపినాథ్ ఉన్నారు.
త్వరలో కందుకూరులో మెడికల్ కళాశాల
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ ఆర్సీఐ రోడ్డుపై గీతాంజలి లైన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన బ్లెడ్ బ్యాంక్ను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో త్వరలోనే వంద పడకల దవాఖాన నిర్మాణం చేయిస్తామని ఆమె చెప్పారు. మంత్రి వెంట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు ఏనుగుల అనిల్కుమార్యాదవ్, భూపాల్రెడ్డి, బీరప్ప, రాజేందర్రెడ్డి, జిల్లా గవర్నర్ రాధా కృష్ణ, రఘు, హరినారాయణ, చెన్న కిషన్, లైన్స్ క్లబ్ సభ్యులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు ఉన్నారు.