Pilot Rohit Reddy | “తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చేయూతనందిస్తున్నారు.. గడిచిన తొమ్మిదేండ్లలో రూ.వేల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది.. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తక్షణమే పరిష్కరిస్తున్నాం.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఊరూరా మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నాం… తాండూరు ప్రజల దీవెనలతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా.. ఎమ్మెల్సీ, మంత్రి మహేందర్రెడ్డి అండదండలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి తాండూరును మరింత అభివృద్ధి చేస్తా.. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి యువతకు ఉపాధి కల్పిస్తాం ” అని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. ఆయన తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన దృష్ట్యా ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ నిర్వహించగా పై విధంగా స్పందించారు. ఇంకా నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, వెచ్చించిన నిధులు, మున్ముందు చేపట్టే ప్రగతి పనులను వివరించారు..
-తాండూరు, ఆగస్టు 25
జిల్లాలో తాండూరు చాల చైతన్యం కలిగిన నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు, పాలకులు మాటల్లో కాదు చేతల్లో చూపుతారు. అందుకు తగ్గట్లు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటు.. ప్రజల కోసం పనిచేస్తూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆశీర్వాదంతో రూ.వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్నాం. తాండూరు ప్రజల దీవెనలతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టికేట్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అండదండలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 50వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించి తాండూరును మరింత అభివృద్ధి చేస్తమని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
– తాండూరు, ఆగస్టు 25
ఎమ్మెల్యే : తాండూరు ప్రజలు ఎంతో చైతన్య వంతులు. గడిచిన నాలుగున్నర ఏండ్లలో తాండూరుకు రూ.వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రజలంతా సహకరించారు. సీఎం కేసీఆర్ మళ్లీ పార్టీ టికెట్ ఇవ్వడం అదృష్టం. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా తాండూరును మరింత అభివృద్ధి చేస్తా.
ఎమ్మెల్యే : గడిచిన ఎనిమిదేండ్లలో తాండూరుకు సీఎం కేసీఆర్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.వేల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. తాండూరు ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతులతో కొత్తరూపును సంతరించుకున్నది. ప్రతి పల్లెకు రోడ్డు, వీధుల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్లను నిర్మించాం. ఎల్ఈడీ లైట్లతో పల్లెలు జిగేల్ మంటున్నాయి. తాండూరు ట్రాఫిక్, వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు 12 కిలో మీటర్ల పొడవున రెండు వరుసలతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకులు తొలగడంతో రోడ్డు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రూ.42.74 కోట్లతో 7 చెక్డ్యాంల నిర్మాణాలు, నియోజకవర్గంలోని 4 మండలాల్లో రూ.5.28 కోట్లతో 24 రైతు వేదికలు, నిత్యం రాకపోకలు, వర్షంతో దెబ్బతిన్న తాండూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని రోడ్లు ఇక సాఫీగా మార్చేందుకు రూ.61.40 కోట్ల నిధులతో ప్రణాళికలు, 167 నేషనల్ హైవేలో భాగంగా రూ.27 కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ వరకు రోడ్డు పనులు, రూ.24 కోట్లతో వేస్తున్న తాండూరు-తొర్మామిడి రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో తాండూరు నియోజకవర్గంలో విద్యాలయాలు, దవాఖానలకు రూ.కోట్లు ప్రత్యేక నిధులతో నూతన భవనాలను నిర్మించాం. రూ.18 కోట్లతో మైనార్టీ పాఠశాల, రూ.16 కోట్లతో మాతాశిశు దవాఖానతో పాటు రూ.కోట్ల నిధులతో గురుకులాలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానల నిర్మాణాలు, బస్తీదవాఖానల నెలకొల్పడం జరిగింది.
ఎమ్మెల్యే : అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇప్పటికే పల్లెల ముఖ చిత్రాలు మారాయి. రూ.వేల కోట్ల నిధులతో తాండూరు స్వరూపం మారుతున్నది. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే.. ప్రజలే తిప్పికొడుతున్నారు. తాండూరు మార్కెట్ యార్డుకు రూ.10 కోట్లు, పారిశ్రామికవాడ నిర్మాణానికి రూ.21 కోట్లు, నర్సింగ్ కళాశాలకు రూ.25 కోట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.2 కోట్లు, ఐటీ కశాశాలకు రూ.3 కోట్లు, పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.74 కోట్లు, ఇంటి గ్రేటెడ్ మార్కెట్కు రూ.5కోట్లు, సబ్స్టేషన్లకు రూ.10 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.61.40 కోట్ల నిదులు విడుదలయ్యాయి. స్వచ్ఛందగా బీఆర్ఎస్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. యువతకు ఉద్యోగాలు కల్పించుటకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. ఇప్పటికే డ్రైవర్లకు బీమా కల్పించాం. మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా అల్లికలు నేర్పిస్తున్నాం. ఎన్నికలు కాగానే మరిన్ని కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేస్తాం.
ఎమ్మెల్యే : ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అండ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిమానం, ప్రజల ఆశీర్వాదంతో 50 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తా. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తాం. తాండూరు ప్రజలు పార్టీలకు అతీంగా నాకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉన్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి సీఎం సార్కు గిప్టుగా ఇస్తాం.