కొడంగల్, నవంబర్ 25: కొడంగల్ అభివృద్ధిపై తగ్గేదే లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కొడంగల్ బొంరాస్పేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సి పల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని గాంధీనగర్ సమీపంలో నిర్మిస్తున్న డబుల్బెడ్ రూం నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.
బాలాజీనగర్ వీధిలో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజలు తమ సమస్యలను తెలుపుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలో సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల భవనాన్ని సందర్శించి, ఆ ప్రదేశంలో నిర్మించే మినీ స్టేడియం స్థల పరిశీలన చేశారు. కళాశాలకు సీసీ రోడ్డుతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే దిశగా ఆ ప్రాంతంలో పార్క్ నిర్మించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని సం దర్శించి సౌకర్యాలను పరిశీలించారు.
డయాలసిస్ సెంటర్తో పాటు ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రావడం పట్ల స్థానికంగా నాణ్యమైన వైద్యసేవలు అందుకునేందుకు ఆస్కారం ఏర్పడినట్లు తెలిపారు. రూ. కోటితో ఆసుపత్రి ఆవరణలో పోస్టుమార్టం గది నిర్మాణంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు గాను జనరేటర్ ఏర్పాటు, పూర్తి భద్రతకు గాను కంపౌండ్వాల్ నిర్మాణం పనులు త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు కావడంతో పాటు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. కొడం గల్లో మొత్తంగా 300ల డబుల్ బెడ్రూం మంజూరు అయ్యాయని ప్రస్తుతం గాంధీ నగర్ వీధిలో 150 డబుల్బెడ్రూం నిర్మాణాల్లో 40 ఇంటి నిర్మాణాలు పూర్తి కావచ్చా యని మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
గ్రామ గ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గతం కంటే రూ.100 ఎక్కువ ధరతో, ఏ రకం ధాన్యానికి రూ.2060, కాబన్ గ్రేడు ధాన్యానికి రూ.2040 చెల్లిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని హస్నాబాద్, పర్సాపూర్ గ్రామాలతో పాటు బొంరాస్పేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మండలంలోని పర్సాపూర్ గ్రామంలో విస్లావత్ నెహ్రూనాయక్ అనే రైతు మృతి చెందడంతో కుటుంబానికి మంజూరైన రైతుబీమా పథకం కింద రూ.5లక్షల చెక్కును ఎమ్మెల్యే అందించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో మొత్తంగా 68 మందికి రూ. 23లక్షల 72వేల చెక్కులను అందజేశారు.
కొడంగల్ ప్రజలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారని, అందువల్లనే పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ అద్యక్షుడు కటకం శివకుమార్, కౌన్సిలర్ మధుసూ దన్రావు యాదవ్, సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీరప్ప, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ కృష్ణ తో పాటు టీఆర్ఎస్ నాయకులు రమేశ్బాబు, నవాజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.