బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు తులసీ గార్డెన్లో జరిగిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ చక్కటి విజన్తో పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ నన్ను కొనేందుకు పదవి, రూ.100 కోట్లు ఆశ చూపిన అమ్ముడు పోలేదని గుర్తు చేశారు. నా ఊపిరి ఉన్నంత వరకూ బీఆర్ఎస్లోనే ఉంటానన్నారు. ప్రతి వార్డుకూ రూ.కోటి నిధులిచ్చి తాండూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
-తాండూరు, మే 2
తాండూరు, మే 2 : రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ స్థాయి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తాండూరు తులసీ గార్డెన్లో సంబురంగా జరిగింది. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల ప్రజలు భారీగా తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలు, కార్యకర్తల ఉల్లాసంతోపాటు గులాబీ శ్రేణుల నినాదాలు, ప్రజా ప్రతినిధుల మాటలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చక్కటి విజన్తో పనిచేస్తుండడంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయన్నారు. కేంద్రంలో పదవి, రూ.100 కోట్లు ఆశ చూపినా బీజేపీకి అమ్ముడుపోలేదని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తాండూరు ప్రజలు సంక్షేమం కోసం ఊపిరి ఉన్నంత కాలం బీఆర్ఎస్లోనే ఉంటూ ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణతోపాటు తాండూరులో ముందెన్నడూ జరుగని అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు.
రూ.134 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
నియోజకవర్గంలో రూ.134 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. తాండూరు అభివృద్ధిలో భాగంగా ప్రతి వార్డుకు రూ.కోటి నిధులు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తాండూరు నియోజకవర్గంలో గడపగడపకూ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. మహిళల కష్టాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటిటీ తాగునీరు, అర్హులైన పేదలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రి, మాతా శిశు ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించుటకు గురుకులాలు, మోడల్ స్కూల్తో పాటు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి సహకారంతో తాండూరుకు నిధులు తీసుకువచ్చి రూపురేఖలు మారుస్తున్నానని పేర్కొన్నారు.
అన్నింటిలో ఆదర్శంగా తాండూరు
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ.. గత పాలకుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న తాండూరు ఇప్పుడు అన్నింటిలో ఆదర్శంగా మారుతున్నదన్నారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ దవాఖానాలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సదుపాయాలతో పాటు భవన నిర్మాణాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందినట్లు భారతదేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీం, కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్గౌడ్, సీనియర్ నాయకులు నర్సింహులు, శ్రీనివాస్చారి, నరేందర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.