కోట్పల్లి, డిసెంబర్ 6: గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరి శు భ్రం గా ఉంచుకోవాలని, గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఉపాధిహామీ కూలీలకు పని చేసినా డబ్బులు పడలేదని, వారికి వెంటనే ఖాతాల్లో డబ్బులు వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, గ్రామాల్లో అవసరమున్న చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు.
మిషన్ భగీరథ నీటి ట్యాంకులను నెలలో మూడు సార్లు అనగా 1, 11, 21వ తేదీల్లో కచ్చితంగా శుభ్రం చేయాలని సూచించారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి, పిచ్చిమొక్కలను తొలగించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో 1వ, 7వ వార్డుల్లో వాటర్ లీకేజీల ఇబ్బందులున్నాయని వాటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ తాగునీటిపై గ్రామాల్లో అవగాహ నకల్పించాలని సూచించారు. పల్లె ప్రగతి సరిగ్గా నిర్వహించలేదని స్థానిక కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని కోరారు.ఈ సందర్భంగాగ్రామంలో నూతనంగా వేసిన సీసీరోడ్లను ప్రారంభిం చారు. నూతనంగా నిర్మించబోయే సైడ్డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలఅధ్యక్షుడు అనిల్కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.