ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 10 : 20ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం పెద్ద చెరువును సందర్శించారు. నీరు 30అడుగుల పైనే చేరుకోవటంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సుమారు 20ఏండ్ల పాటు కరువు కాటకాలతో అలమటించిన ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇస్దుందన్నారు. చెరువులు, కుంటలు, వరదనీటి కాల్వల మరమ్మతులతో నేడు నియోజకవర్గంలోచెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయని తెలిపారు.
ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించే పట్నం చెరువుకు ఇంత పెద్ద ఎత్తున నీరు చేరటం సంతోషించదగ్గ విషయమన్నారు. నీటితో కళకళలాడుతున్న పెద్దచెరువు సుందరీకరణ పనులు అతిత్వరలో చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.