ఆమనగల్లు, ఏప్రిల్ 25 : ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీగార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి 24 ఆంశాలపై చేసిన తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశానికి ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, వాణీదేవి, నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగకుండా కేంద్రం అడ్డుపడుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశాభివృద్ధి శూన్యమన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రం తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా స్వార్థ బుద్ధిని చూపిస్తుందన్నారు. నల్లధనాన్ని బయటికి తెచ్చి ప్రతి భారతీయుడి జన్ధన్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ ప్రభుత్వ మాటలు ఏమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తూ పేద ప్రజలను నిండా ముంచుతుందన్నారు.
గుజరాతీ బడా నాయకులు అప్పు తీసుకొని విదేశాలకు పారిపోతే కేంద్ర బడ్జెట్ నుంచి రూ.13 లక్షల కోట్లను ఆ సంస్థలకు జమ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అనంతరం ఏఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అనురాధ, దశరథ్నాయక్, విజితారెడ్డి, ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, విజయ్గౌడ్, ఎంపీపీలు కమ్లీ, విజయ, మనోరమ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్రావు, పత్యానాయక్ జిల్లా గంథ్రాలయ డైరెక్టర్ రాధమ్మ, నారాయణ, కడ్తాల్ సర్పంచ్ ఎల్ఎన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సుభాష్, బీఆర్ఎస్ నాయకులు కమఠం వెంకటయ్య, సయ్యద్ ఖలీల్, గుత్తి బాలస్వామి, డెరంగుల వెంకటేశ్, జంతుక కిరణ్, కొమ్ము ప్రసాద్, శివకుమార్, లండం యాదయ్య, కంబాలపల్లి అల్లాజీ తదితరులు పాల్గొన్నారు.