మాడ్గుల, ఏప్రిల్ 18 : నరేంద్రమోదీ పాలనలో దేశం వల్లకాడు అయ్యిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని రైతువేదిక భవనంలో 94 మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యాపారులకు దోచిపెట్టే పార్టీ, పెద్దల పార్టీ బీజేపీ అని అన్నారు. బీదల కోసం పని చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల సరుకుల ధరలు పెంచి పేదోడి కడుపు కొట్టిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. దమ్ముంటే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని సవాల్ చేశారు. అనంతరం మాడ్గుల ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లింలతోకలిసి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ఎంపీపీ పద్మారెడ్డి, తహసీల్దార్ దేవుజ, వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్లు జంగయ్యగౌడ్, యాదిరెడ్డి, పార్వతమ్మ, రమేశ్రెడ్డి, హనుమానాయక్, ఏఎంసీ డైరెక్టర్ నిరంజన్జీ, బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారెడ్డి, లాలయ్యగౌడ్, బ్రహ్మంగౌడ్, శ్రీను, జంగయ్య పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని లబ్ధిదారులందరికీ అందేలా కృషి చేస్తున్నామన్నారు. మన ఊరు-మన బడి కింద నియోజకవర్గంలో 324 పాఠశాలలు ఉంటే మొదటి దశలో 108 పాఠశాలలను ఎంపిక చేసి రూ. 69 కోట్లతో పాఠశాలల్లో సమగ్ర మౌలిక వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు. వైద్యంలో భాగంగా నియోజకవర్గ కేంద్రంలోని 50 పడకల ఏరియా దవాఖానను 100 పడకలుగా మార్చామని చెప్పారు. ఆమనగల్లు ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాన్ని 10 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చామని, ఐదుగురు డాక్టర్లను కూడా నియమించామన్నారు. నూతనంగా మైసిగండి, గట్టిపలపల్లి, ఇర్విన్, తోటపల్లి, చారకొండలో పీహెచ్సీ దవాఖానలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నియోజకవర్గంలో 212 తండాల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. జాతీయ రహదారుల ఏర్పాటుతో కల్వకుర్తి దశ దిశ మారుతుందన్నారు.