బషీరాబాద్, జనవరి 19: ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కంసాన్పల్లి, ఎక్మాయి, మంతన్గౌడ్, అల్లాపూర్, జమ్లానాయక్తండా, దామర్చేడ్, వాల్యానా యక్ తండా, నంధ్యానాయక్తండా, కొత్లాపూర్, మల్కాన్గిరి, రెడ్డిఘణపూర్, మంతట్టి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకున్న అర్హులందరికీ పథకాలను అందజేస్తామన్నారు.
నాపై నమ్మకం ఉంచి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు రుణపడి ఉంటానన్నారు. సమస్యలు లేని గ్రామాలను తయారు చేయడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మంచి పాలనను అందించి, ప్రజలకు ఉత్తమ సేవలందిండమే తమ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, మాజీ ఎంపీపీ వెంకటేశ్ మహారాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.