షాద్నగర్, జూన్ 8 : ఉమ్మడి పాలనలో పిచ్చి మొక్కలు , తెగిన కట్టలతో కనిపించే చెరువులకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం షాద్నగర్ మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెరువు పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాడుపడిపోయిన చెరువులకు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకంతో ప్రాణం పోశారని చెప్పారు. చెరువు పండుగలో భాగం గా షాద్నగర్ పట్టణ మహిళలు బతుకమ్మలు చేశారు. బోనాలు చేసి మైసమ్మ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. షాద్నగర్ పట్టణం నుంచి చెరువు కట్ట వరకు ఎమ్మెల్యేతో కలిసి పట్టణ వాసులు, గంగపుత్రులు ర్యాలీ నిర్వహించారు. ఫరూఖ్నగర్ మండలం పీర్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పీర్ల చెరువు వద్ద నిర్వహించిన చెరువు పండుగలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, కౌన్సిలర్లు మహేశ్వరి, ప్రేమలత, శ్రావణి, ఈశ్వర్రాజు, నాయకులు యుగేందర్, పిల్లి శేఖర్, శ్రీశైలంగౌడ్, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
కడ్తాల్లో..
కడ్తాల్: చెరువులు, కుంటల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని, మిషన్ కాకతీయ పథకంలో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కడ్తాల్, చరికొండలో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, ముదిరాజ్ కులస్తులు బోనాలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లారు. కట్ట మైసమ్మకి బోనాలు సమర్పించి, బతుకమ్మలను గంగలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, సులోచన, యాదయ్య, భారతమ్మ, తులసీరాంనాయక్, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్అలీ, నర్సింహాగౌడ్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, గణేశ్, నరేశ్, సువర్ణ, భాస్కర్రెడ్డి, నరేందర్రెడ్డి, భిక్షపతి, గణేశ్, నర్సింహా,జహంగీర్అలీ, ముదిరాజ్ సంఘం నాయకులు యాదయ్య, సత్యనారాయణ, బాలయ్య, అశోక్, రాఘవేందర్, శ్రీను, కృష్ణ, బుచ్చయ్య, శేఖర్, రమేశ్, రాములు, జంగయ్య, యాదగిరి, పాండు, మహేశ్, వెంకటేశ్, ఇరిగేషన్ ఏఈ నిఖిల, ఇన్చార్జి తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో రామకృష్ణ, ఏఈవో మధుసూదనాచారి, వ్యవసాయ ఏవో శ్రీలత, ఏపీఏం రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లులో..
ఆమనగల్లు : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమనగల్లు మండలంలోని ఆయా గ్రామాల్లోని 12 చెరువుల వద్ద చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని సురసముద్రం చెరువు వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ ఆఫీసు నుంచి బోనాలు ఎత్తుకున్న మహిళలతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సురసముద్రం చెరువు వద్దకు చేరుకున్నారు. కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ జిల్లా సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, గంథ్రాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ కమఠం రాధమ్మ, తహసీల్దార్ జ్యోతి, కమిషనర్ శ్యామ్ సుందర్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, డేరంగుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగను కేశంపేట మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మహిళలు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మహిళలు బోనాలు, బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లి బోనాలను చెర్ల మైసమ్మ దేవతలకు సమర్పించి శ్రీవెంకటేశ్వర చెరువు వద్ద బతుకమ్మలను ఉంచి ఆడి పాడారు. మహిళల బతుకమ్మ ఆట, పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలు బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాలశ్రావణ్రెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ, తాసీల్దార్ ఆజం అలీ, ఇంచార్జ్ ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఏఓ శిరీష, సర్పంచ్, ఎంపీటీసీలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
కొత్తూరులో..
కొత్తూరు : దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగను మండలంలోని గూడూర్, ఇన్ముల్నర్వ, పంజర్ల, సిద్దాపూర్ చెరువుల్లో సర్పంచుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీటీసీ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామాల్లో నుంచి మహిళలు బతుకమ్మలు, బోనాలతో డప్పు చప్పుల మధ్య చెరువుల వద్దకు వెళ్లారు. అనంతరం చెరువు కట్టపై బతుమ్మ ఆడి పాడారు. మున్సిపాలిటీలోని శాయిరెడ్డి చెరువులో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో చెరువు పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, సీఐ బాలరాజు, తహసీల్దార్ రాములు, ఎంపీడీవో శరత్చంద్రబాబు, కౌన్సిలర్లు శ్రీనివాసులు, సోమ్లా నాయక్, బ్యాగరి ప్రసన్నలత, చంద్రకళ, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, సర్పంచ్లు బ్యాగరి సత్తయ్య, అజయ్నాయక్, మామిడి వసుంధర, వడ్డె తులసమ్మ, నాయకులు దేవేందర్యాదవ్, వీరమోని దేవేందర్, రవినాయక్, బండి శ్రవణ్, బండి సాయి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తలకొండపల్లిలో..
తలకొండపల్లి : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. చెరువుల పండగలో భాగంగా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ ఏఈ రమేశ్నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు మహిళలు పాల్గొన్నారు.
మాడ్గులలో…
మాడ్గుల : మండలంలోని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పాత బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో చెరువుల పండుగా అంగరంగా వైభవంగా ప్రజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవులు, ఎంపీఓ వేజన్న, ఆర్ఐ సురేశ్, కార్యదర్శులు రమేశ్, రవి, సాయితేజ, నాయకులు బక్కయ్య, చంద్రయ్య, అచ్చయ్య పాల్గొన్నారు.
ఫరూఖ్నగర్లో..
షాద్నగర్రూరల్ : చెరువుల పండుగ కార్యక్రమాలతో ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. హాజిపల్లి, ఎలికట్ట, చించోడ్, చిన్నచిల్కమర్రి, చౌలపల్లి తదితర గ్రామాల్లో సర్పంచులు మౌనిక, సాయిప్రసాద్, శ్రీనివాస్ చెరువుల వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
షాద్నగర్లో..
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంతో పాటు చుట్ట పక్కల గ్రామాల చెరువుల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజలు గురువారం గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల ప్రజాప్రతినిధుల, మహిళలు, అధికారులు బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే చెరువు కట్ట వద్ద మామిడి తోరణాలను కట్టి ముగ్గులు వేసి చూడముచ్చటగా ముస్తాబు చేశారు. చెరువు పండుగతో ఊరూర పండుగ వాతావరణం నెలకొంది.
నందిగామలో..
నందిగామ : ఊరూరా చెరువుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. నందిగామలోని అంబపూరం చెరువు మండల పరిధిలోని నర్సప్పగూడ అకమ్మ చెరువు, అప్పారెడ్డిగూడ అంచుకుంట చెరువుల వద్ద డప్పు దరువులు, బోనాలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి చెరువు కట్టపై అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సీఐ రామయ్య, ఎంపీడీవో బాల్రెడ్డి, తహసీల్దార్ రేహమన్ఖాన్, సర్పంచ్లు గోవిందు అశోక్, నర్సిహులు, జట్ట కుమార్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు కట్న లత, కో అప్షన్ సభ్యులు బేగ్, ముదిరాజ్ సంఘం నాయకులు, పాల్గొన్నారు.