షాద్నగర్, మే 15 : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్, పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు మన పల్లెల గోస ఎట్ల ఉండేదో మనందరికీ తెలుసన్నారు. వేసవికాలం కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా అన్ని గ్రామాలకు భగీరథ నీళ్లు అందుతున్నాయని చెప్పారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు అమ్ముకున్న పంటకు సంబంధించిన డబ్బులు నేరుగా తమ ఖాతాల్లోనే జమవుతాయని వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బక్కన్న, మున్సిపల్ చైర్మన్ నరేందర్, నాయకులు నారాయణరెడ్డి, రవీందర్రెడ్డి, ఏడీఏ నాగరత్నం, పీఏసీఎస్ సీఈవో రఘునందన్, గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కొత్తూరు : మున్సిపల్ కమిషనర్ వీరేందర్ గ్రేడ్-1 కమిషనర్గా పదోన్నతి పొందడంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కమిషనర్ను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, బీఆర్ఎస్ నాయకుడు దేవేందర్యాదవ్, వైస్ చైర్మన్ రవీందర్, సీఐ బాలరాజు పాల్గొనానరు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని రంగధాముల గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు.