కొత్తూరు, ఏప్రిల్ 6: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతో కలిసి రూ. 1.76 కోట్లతో కొత్తూరు నుంచి కుమ్మరిగూడకు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తూరు నుంచి కుమ్మరిగూడ వరకు లోతట్టు ప్రాంతం ఉండటం వల్ల సీసీ రోడ్డును నిర్మిస్తేనే మన్నికగా ఉంటుందని, అందుల్లే సీసీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. కుమ్మరిగూడకు సీసీ రోడ్డు రావాలని ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్లుగా కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, టీఆర్ఎస్నాయకుడు దేవేందర్యాదవ్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులుగూడ్, మైసిగళ్ల రమేశ్, బాలరాజ్, రవి పాల్గొన్నారు.
నందిగామ : ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అందజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం అంతిరెడ్డిగూడ గ్రామంలోని శ్రీ రామాంజనేయ స్వామి, గణపతి, శివలింగం, బొడ్రాయి పునఃప్రతిష్ఠ, నూతన సీతారామ, లక్ష్మణ దేవాలయ విగ్రహ ప్రతి ష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం జంగోనిగూడ సీసీ రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్, బీజేపీ నేత శ్రీవర్ధన్రెడ్డి, నందిగామ సర్పంచ్ జిల్లెల్ల వెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ మెక్కోండ కుమార్గౌడ్, ఎంపీటీసి కుమార్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్ పాల్గొన్నారు.