మొయినాబాద్, అక్టోబర్ 25 : కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల పాలనలో గొంతు తడుపు కోవడానికి గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడేవారిని, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీళ్లు అందుతున్నాయని ఎమ్మెల్యే , బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎల్కగూడ, కుతుబుద్దీన్గూడ, వీరన్నపేట, చందానగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
తెలంగాణ ప్రాంతం ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించిన దాఖలాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, ఎల్కగూడ సర్పంచ్ ఆలూరి కుమార్, కుతుబుద్దీన్గూడ సర్పంచ్ పద్మమ్మ, చిన్నమంగళారం ఎంపీటీసీ బట్టు మల్లేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరియాదవ్, సీనియర్ నాయకులు దర్గ రాజు, విఠల్, మల్లేశ్, సురేందర్గౌడ్, పరమేశ్, రమేశ్, కిరణ్, ప్రభాకర్రెడ్డి, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తు ఓటు వేయాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రజల కోసం ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలువాలన్నారు. షాద్నగర్ మరింత అభివృద్ధి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జూపల్లి శంకర్, సుధాకర్, పాండురంగారెడ్డి, భిక్షపతి, సలీం, రాజు పాల్గొన్నారు.