మర్పల్లి, అక్టోబర్ 21 : కాంగ్రెసోళ్ల ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని తిమ్మాపూర్, రావులపల్లి, కుడుగుంట, పెద్దాపూర్, గుర్రంగట్టు తండాలో మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను పంచాయతీలుగా గుర్తించి ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వానికి మరోసారి సంపూర్ణ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
60 ఏండ్లలో చేయని అభివృద్ధి.., తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేశారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.400లకే సిలిండర్ను అందించడం, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను రెట్టింపు చేయడం, మహిళలకు రూ. 3వేల భృతి, తెల్ల రేషన్ కార్డు ఉండి అర్హులైన వారికి ప్రభుత్వమే బీమా ప్రిమియాన్ని చెల్లించి ఆ కుటుంబానికి కేసీఆర్ బీమాతో దీమాగా ఉండేందుకు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రావులపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
మండలంలోని పిల్లిగుండ్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నాగయ్య, రావులపల్లి కాంగ్రెస్ నాయకులు రాజేందర్రెడ్డి, బాల్రెడ్డి, విజేందర్రెడ్డి, పెద్దాపూర్కు చెందిన సుధాకర్రెడ్డి, మల్లారెడ్డి, కొంషెట్పల్లికి చెందిన మైనార్టీ నాయకులు ఖలీల్, ఖాజాతో పాటు 30 మంది ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అంతకు మందు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు శేఖర్, ఉమారాణి గోపాల్రెడ్డి, సాలీబాయి, ఎంపీటీసీ రవీందర్, ఎంపీపీ లలితారమేశ్, జడ్పీటీసీ మధుకర్, వైస్ మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, యూత్ అధ్యక్షుడు మధుకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.