రంగారెడ్డి, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): సువిశాల భారత్లో తెలంగాణ విలీనమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉదయం 9 గంటలకు మంత్రి సబితారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా.. వికారాబాద్ కలెక్టరేట్లో మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఉదయం 8.45 గంటలకు జెండాను ఎగురవేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతోపాటు అధికారులు పాల్గొననున్నారు.