రంగారెడ్డి : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ను, కోటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Reddy) , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి , ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ , పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కోటి వృక్షార్చనను (Crore Plantation) విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా ప్రారంభ కార్యక్రమాన్ని మంచిరేవుల (Manchirevula) లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 5 లక్షల 40 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలు (Educationao Institutions), యువత (Youth)ను భాగస్వాములను చేయాలని కోరారు.
ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 360 ఎకరాల విస్తీర్ణంలో పార్క్ (Park) ను అభివృద్ధి చేసిందన్నారు. అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్తో అభివృద్ధి చేసిన పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువనుందని పేర్కొన్నారు. పార్కులో గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, తదితర సదుపాయాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 283.82 కోట్ల మొక్కలు నాటామని మంత్రి పేర్కొన్నారు.