యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువగర్జనలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ యువతకు విద్యాఉద్యోగ, రాజకీయాల్లోనూ అవకాశాలు కల్పించారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాలతోపాటు అనేక విద్యా సంస్థలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేంద్రం ఇవ్వకున్నా.. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి యువత అండగా నిలవాలని కోరారు. కార్యక్రమానికి ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై బీఆర్ఎస్.. జై సబితమ్మ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది.
– రంగారెడ్డి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువగర్జన కార్యక్రమంలో మంత్రి మాట్లాడా రు. దేశంలో ఏ పార్టీకి లేనంత యువశక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు.
సీఎం కేసీఆర్ సైతం యువతను అక్కున చేర్చుకుని అసెంబ్లీ, పార్లమెంట్తోపాటు కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించారన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే ఉద్యోగాల జాతర కొనసాగుతున్నదని, ఇప్పటికే లక్షా 60 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయగా.. మ రో 70వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉ ద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్రంలోని బీజేపీ మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ను రద్దు చేస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఫ్యాక్స్ కాన్ను తెలంగాణ నుంచే తరలించే కుట్రలు చేస్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాలతోపాటు అనేక విద్యా సంస్థలను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకుని విద్యా హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని మంత్రి సబితారెడ్డి అన్నా రు. కేంద్రం ఇవ్వకున్నా.. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూనే.. ప్రైవేటు రంగంలో 24లక్షల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. యువత బంగారు భవిష్యత్తుకు బాట లు వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన యువతకు ధన్యవాదాలు తెలిపారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ భారీగా తరలివచ్చిన అశేశ యువతను చూస్తేనే మహేశ్వరంలో సబితక్క గెలుపు ఖాయమైనట్లు స్పష్టమవుతున్నదన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సబితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడ స్వాగత్ గ్రాండ్ సమీపంలోని లలిత చౌరస్తాలో నిర్వహించిన యువగర్జన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. యువ ప్రభంజనంతో ఆ ప్రాం తం గులాబీమయమైంది. కార్యక్రమానికి ముం దు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చందనం చెరువు కట్టమీది నుంచి ర్యాలీగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నడుచుకుంటూ సభాస్థలికి వచ్చారు. జై బీఆర్ఎస్.. జై సబితమ్మ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది.