బొంరాస్పేట, నవంబర్ 19 : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కొడంగల్ నియోజకవర్గంలో ఐదేండ్లలో జరిగిన ప్రగతిని మంత్రి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ చెప్పే మోసపూరిత మాటలను నమ్మితే ప్రజలు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు.