ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 10 : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ కల లాంటిదని త్వరలోనే ఆ కల సాకారం కానున్నదని, దీంతో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తీరనున్న దని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఆమె ఇబ్రహీంపట్నంలో పంచాయతీ రాజ్ ఈఈ, పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉ న్న నాయకుడని, ఆయన 9ఏండ్ల పాలనలో రా ష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందన్నారు. ఇప్పటికే కా ళేశ్వరం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారని, అలాగే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఈ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో కం టున్న కల అని అన్నారు. ఈ కలను త్వరలోనే సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు జిల్లాలో మరిన్ని నియోజకవర్గాలకు సాగునీరు రానున్నదన్నారు.
భవిష్యత్లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతో పా టు రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారనున్నాయ ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఇప్పటికే అభివృద్ధి ప రంగా ఎంతో పురోగతి చెంది ఈ ప్రాంతం భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందనున్నదన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మధ్యలో త్వరలో నే మెడికల్ కళాశాల కూడా రానున్నదన్నారు. ఇ ప్పటికే నియోజకవర్గంలో కలెక్టర్ కార్యాలయా న్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో అనే క పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, పంచాయ తీ రాజ్ ఈఈ సురేశ్చంద్రారెడ్డి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు సుజాత, శ్వేత, సుధాకర్, జగన్, భానుబాబు, మమత, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాములు, రవీందర్, రాజు పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
సాగునీటికోసం ఇప్పటికే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఒక డీపీఆర్ను తయారుచేసి సీఎం కేసీఆర్కు అందజేశారని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆ డీపీఆర్కు త్వరలోనే ముఖ్యమంత్రి ఆమోదం తెలుపుతారన్నారు. పరిపాలనను మరింత ప్రజల వద్దకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం తండాలను గ్రామ పంచాయతీలుగా, 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా గుర్తించారన్నారు. అలాగే మండలాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించి, మూడు కలెక్టర్ కార్యాలయాలు నిర్మించుకున్నామన్నారు. అలాగే, శాంతిభద్రతలు కూడా మరింత మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో కొత్త పోలీసుస్టేషన్లతో పాటు కమిషనరేట్, డీసీపీ, ఏసీపీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగేదని ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భిన్నంగా పరిపాలన ప్రజల చెంతకు తీసుకొస్తున్నారన్నారు. భవిష్యత్లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మరింత అభివృద్ది చెందనున్నదని మంత్రి సబితారెడ్డి అన్నారు. తుక్కుగూడ వరకు మెట్రోను పొడిగిస్తున్నందున, దానిని ఇబ్రహీంపట్నం వరకు పొడిగించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి సీఎంను కోరారని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.