షాబాద్, అక్టోబర్ 26: తెలంగాణలో ఇంకా 20 ఏండ్ల దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండ టం ఖాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన గణపు రం రాంచంద్రయ్య, నర్సింహులు, జంగయ్య, చీమల మహేందర్, నందీశ్వర్, ప్రవీణ్, శివకుమార్, హరీశ్, యాదయ్య, మహేందర్, రమేశ్లతో పాటు సుమారు 50 మంది వివిధ పార్టీల నాయకులు మంత్రి పట్నం మహేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ ప ట్నం అవినాశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా లు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగా ణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రా వు, గ్రామ సర్పంచ్ కుమ్మరి దర్శన్, ఉప సర్పం చ్ మల్లాపురం రాజేందర్రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట : మండలంలోని బీజేపీ నేతలు గురువారం మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, వైస్ ఎంపీపీ బందయ్యగౌడ్, పీఏసీఎస్ రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దయాకర్రెడ్డి, సర్పంచులు రఫీ, పర్మయ్య, బల్వంత్రెడ్డి, నర్సింహులు, రత్నం, నేతలు మల్లారెడ్డి, రామచంద్రయ్య, ప్రభాకర్, రంగారెడ్డి, ఆనంద్రెడ్డి, యెల్లకొండ ఆలయం చైర్మన్ భరత్రెడ్డి శాంతికుమార్, ఖదీర్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే కాలె యాదయ్య వెంటే మేముంటామని రత్నం వర్గీయులు తేల్చి చెబుతున్నారు. మండ ల పరిధిలోని మేడిపల్లి మాజీ సర్పంచ్ నవీన్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయుడిగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. నవీన్ ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా ఉండి బీఆర్ఎస్లోనే కొనసాగిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయుడిగా ముద్రపడిన నవీన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చె ప్పారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఆయన వర్గీయులు రత్నం వెంట వెళ్లకుండా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ యాదయ్య గెలుపునకు కృషి చేస్తామన్నారు. గురువారం నవీన్కు గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మేం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య వెంట ఉండి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని నవీన్ పేర్కొన్నారు. నవీన్తో పాటు మాజీ ఎంపీటీసీ వెంకటేశ్ రత్నం వర్గీయుడిగా ఉన్న వెంకటేశ్ ఇప్పుడు యాద య్య వెంటే ఉంటామని రత్నం వర్గీయులు అనడంతో బీఆర్ఎస్ అభ్యర్థి యాదయ్య నవీన్కు, వారి అనుచరులకు ధన్యవాదాలు తెలిపారు.
కొడంగల్/దౌల్తాబాద్, అక్టోబరు 26 : గులాబీ రంగు పార్టీలో రోజు వారీగా జోరుగా జరుగుతున్న చేరికలను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు హడలెక్కుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్లో దౌల్తాబాద్ మండలంలోని నీటూర్ గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దూ ర్ మండలంలో చెన్నారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరా రు. అభివృద్ధి వైపే మేమున్నామంటూ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం నీటూర్ గ్రా మానికి చెందిన వెంకటేశ్, మహబూబ్, మహే శ్, అంజిలప్ప, భీంరెడ్డి, మధు, బాల్రాజ్, శివరాజ్, బాలు, నరేశ్, మహేశ్, కుమ్మరి రాజు, చిన్న, వ్రవణ్కుమార్గౌడ్, సురేశ్గౌడ్, గోపాల్, అర్జున్గౌడ్, జనార్దన్రెడ్డి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం 30 మంది బీఆర్ఎస్ పార్టీ నీటూర్ గ్రామ అధ్యక్షుడు సత్తయ్యగౌడ్ ఆధ్వర్యంలో గులాబీ దండులో చేరారు.
ఇదే జోరు తో మద్దూర్ మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో 100మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మె ల్యే, బీఆర్ఎస్కు మద్దతు తెలియజేస్తూ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరికి విసిగి వేసారి, అభివృద్ధికే మా ఓటు అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరేందుకు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరుతున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తున్నదన్నారు. ఐదేండ్లలో కొడంగల్ నియోజకవర్గ రూపురేఖలు ఎలా మారాయో ప్రజలే గు ర్తించాలన్నారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ మా జీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్రావు, నాయకులు మహిపాల్రె డ్డి, భగవంతు, మద్దూర్ మండల బీఆర్ఎస్ నా యకులు బాల్సింగ్, వెంకటయ్య, శివకుమార్, వీరేశ్గౌడ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధారూరు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఘనమైన అభివృద్ధి జరుగుతున్నదని, గులాబీ గళమే తెలంగాణకు బలమని, పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనం ద్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ధారూరు మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపసర్పంచ్ రాము, వార్డు సభ్యుడు రాజు, నాయకులు చందు, సంతోశ్, పాండు, ప్రకాశ్ వారి అనుచరులు 50మంది, కుమ్మరిపలికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతారాం, రాజు, పాండు, గోపాల్ వారి అనుచరులు 15మంది ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ధారూరు వైస్ ఎంపీపీ విజయ్కుమార్, మండల నాయకులు వేణుగోపాల్ రెడ్డి, వెంకటయ్య, సంతోశ్కుమార్, అంజ య్య, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్ : తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి దశ, దిశ లేకుండా పోయింది. గ్రామాల్లో కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. మరోసారి తాండూరు ఎమ్మెల్యేగా రోహిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. గురువారం మండలంలోని బిజ్వార్, వీరారెడ్డిపల్లి గ్రామాల నుంచి యువనాయకు లు, ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నా రు. సీఎం కేసీఆర్ చేసిన పథకాలకు ఆకర్షితుల మై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. తాండూరు మండలం నుంచి మెజార్టీ ఓట్లు వేసేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్రెడ్డి, ఉమ్మడి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాంలింగారెడ్డి, గౌతాపూర్ సర్పంచ్ రాజప్ప, పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
పెద్దేముల్ : తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చే పట్టిన అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఇందూరు ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, మంబాపూ ర్ సర్పంచ్ శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రా ష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. పార్టీ కార్యకర్త లు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం నంచర్ల గేట్ సమీపం లో ఉమ్మడి గండీడ్ మండల కార్యకర్తలతో స మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వా త రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, పేదల కోసం చే పట్టిన పథకాలపై ప్రజలకు తెలియజేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మోసపూరిత హామీలను ఇస్తున్నదని తెలిపారు.
ఇలాంటి మోసపూరిత హామీలను ప్రజలు నమ్మకుండా వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని కోరారు. గ్రామాల్లో జరిగి న అభివృద్ధిని చూసి నంచర్ల, దేశాయిపల్లి, శేక్పల్లి, గంగ్యానాయక్ తండాల నుంచి 100 మం ది కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భిక్షపతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్, సర్పంచులు వెంకట్రాంరెడ్డి, గోపాల్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటే శ్, నాయకు లు గోపాల్రెడ్డి, రాజు, అశోక్రెడ్డి, రాంచంద్రారెడ్డి, చంద్రయ్య, బాలవర్ధన్రెడ్డి, ఆయా గ్రామాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు.