‘కోస్గి, నవంబర్ 7 : అబద్ధాల రేవంత్రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖాయం.. నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు..’ అని గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఎన్నడూ రాని రేవంత్రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నరేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఐటీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొడంగల్ పట్టణంలో బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ శ్రేణుల సమావేశం జరుగగా, మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
రానున్న ఎన్నికల్లో కొడంగల్ నుంచి పట్నం నరేందర్రెడ్డి రెండోసారి భారీ మెజార్టీతో గెలవడంతోపాటు.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గను లు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కోస్గి మున్సిపల్లోని ఫామ్హౌస్లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశానికి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..అబద్ధాల రేవంత్రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖా యమని..నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఎన్నడూ రాని రేవంత్రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
బీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేసి పట్నం నరేందర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కొడంగల్లో రేవంత్రెడ్డి ఓటమి చెందుతారన్నారు. నిన్న పీసీసీ అధ్యక్షుడు కొడంగల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఐదేండ్ల కాలంలో సెగ్మెంట్లో వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు వివరించారు. దౌల్తాబాద్కు జూనియర్ కాలేజీ వచ్చి ప్రారంభమైన విషయం కూడా అతడికి తెలియదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మహబూబ్నగర్- చించోలి హైవే పనులు ప్రారంభమై తుది దశకు చేరుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. రేవంత్రెడ్డి చెప్పే అబద్ధాలను ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. ‘కొడంగల్లో నామినేషన్ వేసి వెళ్తా ..నన్ను గెలిపించండి అని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలపై నరేందర్రెడ్డి వ్యగ్యంగా స్పందించారు. ఓటు అడిగేందుకు రానోడు ప్రజలకు ఏమి చేస్తాడని. సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు.’
ఈనెల 9న తాను నామినేషన్ వేసే కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కొడంగల్కు వస్తున్నందున అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. కాగా కోస్గి మున్సిపల్ పరిధిలోని జాండ్ర కమ్యూనిటీ హాల్లో టీడీపీకి చెందిన రాములు, తన అనుచరులు వందమందితో కలిసి మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెగ్మెంట్ అన్ని రంగాల్లోనూ వెనుకబడిందన్నారు. అంతకుముందు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం అతడికి వారు శుభాకాంక్షలు చెప్పా రు. కార్యక్రమంలో మాజీ స్టోర్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఈజీఏస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు శ్రీను, బాలేశ్, జనార్దన్ రెడ్డి, బందెప్ప, మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు ఓప్రకాష్, వరప్రసాద్, రాజేందర్రెడ్డి, అమృతమ్మ శ్రీ తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్పేట, నవంబర్ 7: గడిచిన ఐదేండ్లలో కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామని .. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి గ్రామాలు, తండాలను ప్రగతిపథంలో నిలిపినట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఈ నెల 9న ఎమ్మెల్యే నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న సందర్భంగా మంగళవారం కొడంగల్ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత కోసం అనేక పథకాలను అమలు చేసిందని.. కుల వృత్తుల వారు గౌరవప్రదంగా జీవించేందుకు కోట్లాది రూపాయల ఆర్థిక సాయం చేసిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించి నీటి ఎద్దడిని శాశ్వతంగా నిర్మూలించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేయాలని యత్నిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ నెల 9న మంత్రి కేటీఆర్ హాజరవుతున్న కార్యక్రమానికి బొంరాస్పేట, దుద్యాల మండలాల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి మహేందర్రెడ్డి కోరారు. కార్యక్రమంలో బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, బొంరాస్పేట మండల ఇన్చార్జి రాజు, వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, పార్టీ నాయకులు రమణారెడ్డి, రామూనాయక్, మహేందర్, నర్సింహానాయక్, నెహ్రూనాయక్, సోంనాథ్ పాల్గొన్నారు.కాగా బొంరాస్పేట మండలంలోని చెట్టుపల్లితండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తుల్జానాయక్, శాంతీబాయి తదితరులు మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.