ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 9 : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతున్నదని, ఈ ప్రాంతం పచ్చబడటం బీజేపీకి ఇష్టంలేదని రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి రూ.221కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వెనుకబడిన రంగారెడ్డిజిల్లా వంటి ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరినా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ముచ్చర్ల సమీపంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చిందని, దీనికీ కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీరు అందించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అనేకసార్లు తన దృష్టికి తీసుకొచ్చారని, తప్పకుండా ప్రభుత్వపరంగా సహకారాన్ని అందిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో మిషన్భగీరథ పైపులైన్ కోసం రోడ్లు పూర్తిగా తవ్వడం వల్ల మరమ్మతులకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి కోరగా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.15కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనుల కోసం అవసరమైన నిధులనూ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. నగరానికి అతిసమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువును కూడా తుర్కయాంజాల్ మాసాబ్చెరువు తరహాలో అభివృద్ధి చేయాలని, అవసరమైన నిధులను అందజేస్తామని మంత్రి తెలిపారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్చెరువు సుందరీకరణతో పాటు ఇతర కార్యక్రమాలకు రూ.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల నుంచి మురికి నీరు వచ్చి మాసాబ్ చెరువులో చేరుతుందని, మురికినీరు ఎస్టీపీ ప్లాంట్ ద్వారా పక్కదారిలో వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, గిడ్డంగుల సంస్థచైర్మన్ సాయిచంద్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, వైస్చైర్మన్ సత్తయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, క్యామ మల్లేశ్, కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, నోముల కృష్ణగౌడ్, సత్తు వెంకటరమణారెడ్డి, బర్ల జగదీశ్యాదవ్, డబ్బికార్ శ్రీనివాస్, జేపీ శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీలు భూపతిగల్ల మహిపాల్, జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, చెవుల స్వప్న, మల్రెడ్డి అనురాధ, కొత్త ఆర్తిక, వైస్చైర్మన్లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ, గుండ్లపల్లి హరిత, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, చిలుకల బుగ్గరాములు, రమేశ్, కిషన్గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, కొప్పు జంగయ్య, అమరేందర్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై ప్రధాని మోదీ వెళ్లగక్కిన అక్కసుపై ఉమ్మడి జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొని మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన ప్రధాని దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. నల్ల బ్యాడ్జీలు, కండువాలు ధరించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్వహించిన నిరసన ర్యాలీలు, శవయాత్రలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు హోరెత్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను మోదీ అపహాస్యం చేశారని మండిపడ్డారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ)
ప్రజలకు మేలు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్రం.. పైసా ఇవ్వకపోగా అడ్డుకోవాలని చూస్తున్నదని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో రూ.221 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు – రంగారెడ్డి పథకానికి జాతీయహోదా ఇవ్వాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో రంగారెడ్డికి సాగునీరు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదన్నారు. అలాగే ముచ్చర్ల సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటికీ కూడా కేంద్రం పైసా ఇవ్వలేదన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న జాపాల – రంగాపూర్ అబ్జర్వేటరీకి చెందిన 200ఎకరాల భూమిలో సాంకేతిక పరమైన కళాశాలలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, త్వరలోనే తీపికబురు వినిపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వినతి మేరకు మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
మంత్రి కేటీఆర్తో పాటు సబితాఇంద్రారెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలు ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల నుంచి భారీగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బొంగుళూరు ఔటర్రింగ్రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వరకు వేలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో భారీ గజమాలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్టాప్ జీపులో ఆయన ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
– టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు 70 కిలోమీటర్ల సాగర్హ్రదారి విస్తరించి ఉందని, ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా బీఎన్రెడ్డినగర్ నుంచి మాల్ వరకు రహదారి విస్తరణకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. జాపాల-రంగాపూర్ అబ్జర్వేటరీలో టెక్నికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో పార్కుల స్థలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ముందుగా 6 పార్కులకు రూ.3కోట్లను కేటాయించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించామని తెలుపగా, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
– విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
జాపాల – రంగాపూర్ అబ్జర్వేటరీకి 200 ఎకరాల భూమి ఉన్నదని, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం నిరుపయోగంగా ఉందని, ఇందులో సాంకేతిక పరమైన కళాశాలలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జాపాల -రంగాపూర్ అబ్జర్వేటరీకి సంబంధించిన ఖగోళశాస్త్ర పరిశోధనశాలతో పాటు ఇతర సాంకేతిక పరమైన కళాశాలలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో..
ఆదిబట్ల మున్సిపాలిటీలో..
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో..