కేపీహెచ్బీ కాలనీ:సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో వర్షాకాలంలో దోమలనివారణ, సీజనల్ వ్యాధులపై ఎంటమాలజీ, ట్రాన్స్పోర్టు విభాగం అధికారులతో జడ్సీ మమత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై దృష్టిసారించాలని డెంగ్యూ, ఇతర విషజ్వరాలు ప్రభలిన ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు.
దోమలను లార్వా దశలోనే అరికట్టాలని, కాలనీలు, బస్తీలలో అపరిశుభ్ర ప్రాంతాలను గుర్తించి రసాయనాలను పిచికారి చేయాలన్నారు. ఐదు సర్కిళ్లలో ప్రధాన చెరువులలో చేపట్టిన గుర్రపుడెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
అలాగే రోడ్ల పక్కన చెత్త కుప్పలు, వ్యర్థాలు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంటమాలజీ సీనియర్ అసిస్టెంట్ వై.లచ్చిరెడ్డి, సీటీవో గోవర్దన్ గౌడ్, ఏఎంసీ శ్రీకాంత్ రెడ్డి, ఐదు సర్కిళ్లకు చెందిన ఎంటమాలజీ, ట్రాన్స్పోర్టు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.