ఉప్పల్ : మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారాలని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ అన్నారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు.
ముఖ్యంగా మహిళలు ఉన్నతవిద్యను పూర్తిచేసి, స్వయంకృషితో ఎదగాలన్నారు. ఆన్లైన్ తరగతులు సద్వినియోగం చేసుకొని, ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. చదువుతోపాటుగా, అన్నిరంగాలలో తగిన నైపుణ్యం సాధించాలన్నారు. చివరి సంవత్సరం పూర్తిచేసుకున్న విద్యార్థినులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకురాలు విజయలక్ష్మి, బాస్ శైలజ, చంద్రకళ, రవి, చైతన్య, క్రాంతి, ఫరీదా, అనూష, మాధవి పాల్గొన్నారు.