ఉప్పల్ :మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్తో కలిసి అమ్మవారి ఆలయాన్ని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.
కాలనీల్లో తోట్టెల ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం కాలనీవాసుల ఐక్యతను చాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నేతలు పల్లె నర్సింగ్రావు, ఏదుల్ల కొండల్రెడ్డి, మాస శేఖర్, జగన్, అన్య వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.