జీడిమెట్ల, జులై 8 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్లో రూ.38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రతి బస్తీ, కాలనీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్ని నిధులైనా వెచ్చించి బస్తీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్రావు, మాజీ కౌన్సిలర్ కిషన్రావు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశొక్, పోలే శ్రీకాంత్, నాయకులు మారయ్య, వేణుయాదవ్, తారాసింగ్, రాజ్కుమార్, ప్రభాకర్, అశోక్, భాస్కర్, రాముడు, రమణ, సత్యనారాయణ చారి, రాజు, మోహన్రెడ్డి, కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.