హైదరాబాద్ : ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల జిల్లా కూకట్పల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో గుర్తు తెలియని దుండగులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండరాయితో కొట్టి హతమార్చారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.