మేడ్చల్ రూరల్, మార్చి 21 : కుంటలో పడి కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి పూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..పూడూరు గ్రామ పరిధిలో ఉన్న నెల్లికుంటలో తేలియాడుతున్న మృతదేహాన్ని సోమవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, అతడి వద్ద దొరికిన నోటుపుస్తకం ఆధారంగా వివరాలను సేకరించారు.
పూడూరు గ్రామ పరిధిలో ఉన్న సుభిషి నిర్మాణ సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న బీహార్కు చెందిన ప్రేమ్కుమార్(35)గా గుర్తించారు. కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.