జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగర్కు చెందిన హమాల్పూర్ శ్యామ్ సుందర్ (45) ఎలక్ట్రిషన్ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు.
మంగళవారం శ్యామ్ సుందర్ మరో వ్యక్తి గోపాల్తో కలిసి గాంధీనగర్లోని ఓ షెడ్లో ఇనుప స్టూల్ వేసుకుని ట్యూబ్లైటు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్థానికులు అతనిని చింతల్లోని ఒ ప్రైవేటు దవఖానాకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.