రామంతాపూర్: టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డిని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ యువకాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రెండోసారి ఆయన తిరుమలను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు , ఆయన తెలిపారు. తిరుమల అభివృద్ధిలోవైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంతో ఘననీయమైందన్నారు. ఈ కార్యక్రమంలో తొలుపునూరి కృష్ణగౌడ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.