ఘట్కేసర్ రూరల్: గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలో గౌరవ ప్రదమైన స్నేహ సంబంధాలనుపెంచుకోవడానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు జరుపుకుంటున్న తీజ్ పండుగ వేడుకలలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మన దేశంలో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని , గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నట్లు తెలిపారు.
వారికి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం గిరిజన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ అయిలయ్య, పంచాయతీ సభ్యులు పద్మ, మల్లేష్, అరుణ, రవి నాయక్, కుశలవ రెడ్డి నాయకులు నరసింహ్మ గౌడ్, మాధవ రెడ్డి, దయాకర్, వామన్ రెడ్డి, బుచ్చినాయక్, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.