జవహర్నగర్: కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ 5వ డివిజన్లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్ మాట్లాడుతూ నూతనంగా అమ్మవారి దేవాలయాన్ని నిర్మాంచామని, గురువారం అమ్మవారి విగ్రహప్రతిష్ఠలో భాగంగా పంచామృత అభిషేకాలు చేశామని, అంబేద్కర్నగర్ ముత్యాలమ్మ అమ్మవారికి ఎంతో చరిత్ర ఉందని, అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్ధులుయాదవ్, వెంకటనర్సయ్య, కాయితి రాజు, యుగేందర్, రవి, చంద్రమౌళి, రాజయ్య, నాగలక్ష్మి, లక్ష్మి, యాకమ్మ, రాజు, కృష్ణయాదవ్, పృద్విగౌడ్, నరేష్, మోహన్, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.