వినాయక్నగర్ : ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ సీటీఎం జానకిరామ్ అన్నారు. శుక్రవారం లోతుకుంటలో ఆర్టీసీ బస్ పాస్ రెన్యూవల్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీటీఎం జానకిరామ్ మాట్లాడుతూ నగరంలో 41వ బస్ పాస్ సెంటరని, ఉదయం 6.30నుంచి రాత్రి 8.30గంటల వరకు సేవలందిస్తుందని అన్నారు. అల్వాల్, వెంకటాపురం, యాప్రాల్, బాలాజీనగర్, సీఆర్పీఎఫ్, చెన్నపూర్ ప్రాంతాలలోని బస్ పాస్ దారులు సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హకింపేట డిపో మేనేజర్ భాస్కర్రెడ్డి, జగన్, నాగరాజు, శ్రీనివాస్, సునీత, విష్ణువర్థన్, ఉదయ్కుమార్, పవన్కుమార్, రమణ, నర్సింగ్రావు, మీనాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.