దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీ
కళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా, షాపూర్నగర్ చౌరస్తాలతో పాటు కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ చౌరస్తాలోనూ కళాబృందం ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆర్టీసీ కళా బృందం సభ్యులు ప్రదర్శనల ద్వారా తెలియజేశారు.