మేడ్చల్ మల్కాజిగిరి : లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెందిన అమర్జీత్ కుమార్ యాదవ్ (33) దంపతులు బాలానగర్ జింకల వాడలో నివాసం ఉంటూ సనత్నగర్ రైల్వే స్టేషన్లో రైల్వే గూడ్స్ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
గతంలో అమర్జీత్ కుమార్ యాదవ్ చింతల్లో నివాసం ఉండేవాడు. గ్యాస్ కనెక్షన్ మార్పిడి కోసం శుక్రవారం ఇంటి నుంచి తన బైక్ (బీఆర్ 33 కె 5545) పై చింతల్కు వస్తుండగా.. వెనుక నుంచి లారీ ’(టీఎస్ 08 యు ఎఫ్ 6066) బైక్ను ఢీ కొట్టింది. దీంతో అమర్జీత్ కుమార్ యాదవ్ లారీ వెనుక చక్రాల కింద పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీకి తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారు.