కీసర, ఆగస్టు : ఐదేండ్ల వయస్సు చిన్నారిని కీసర పెట్రోలింగ్ మొబైల్ టీం పోలీసులు గుర్తించారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రంలో జాహ్నవి దవాఖాన వద్ద ఆదివారం రాత్రి ఏడుస్తూ 5 ఏండ్ల చిన్నారి కన్పించింది.
ఆ మార్గంగూండా వెళుతున్న పెట్రోలింగ్ మొబైల్ టీం ఆమె వివరాలు సేకరించింది. ఆ అమ్మాయి పేరు జయశ్రీ . తల్లిదండ్రుల పేర్లు సాయి, రాధ అని చెప్పింది. వెంటనే వారు సీఐ ఆదేశాలమేరకు నాగారం మున్సిపల్ పరిధి రాంపల్లిలోని సాఫ్కిన్ ఆర్ఫాన్స్ ఆనాథాశ్రమంలో ఉంచారు. ఈ చిన్నారి కోసం ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే కీసర పోలీసుస్టేషన్లో సంప్రందించాలని కోరారు.