మేడ్చల్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సింహపురి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పోషకాహార పదార్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొట్టే దివ్య దయాకర్, నాయకులు దయాకర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.