మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజిష్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లకిరువైపులా, జేబీ వెంచర్ పార్కులో నాటిన మొక్కలను పరిశీలించారు.
ఎంత మేరకు లక్ష్యం పూర్తి చేశారు..? అని అడిగి తెలుసుకున్నారు. మిగితా లక్ష్యాన్ని కూడా సాధ్యమైనంత తొందరంగా పూర్తి చేయాలన్నారు. వెంచర్లలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సర్పంచ్కు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి, బిల్ కలెక్టర్ విజయ్ పాల్గొన్నారు.