కీసర: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కీసర మండల పంచాయతీ అధికారి మంగతాయారు అన్నారు. మండల కేంద్రంలోని కీసరగుట్టకు వెళ్లే రోడ్డులో హరితహారం పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ పనులను శుక్రవారం ఎంపీవో మంగతాయారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీవో మంగతాయారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించుకోవడానికి జాలీలను ఏర్పాటు చేసి వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
నాటిన మొక్కల స్థానాల్లో మొక్కలు ఎండిపోతే వాటి స్థానాల్లో కొత్త మొక్కలను నాటాలన్నారు. హరితహారం విషయంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ఆప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలని సూచించారు.