మల్కాజిగిరి, మే 18 : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మౌలాలి డివిజన్ ఆఫీసర్స్ కాలనీ, షఫీనగర్, సాదుల్లానగర్లలో రూ.64లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆఫీసర్స్ కాలనీలోని పార్వతినగర్లో శ్రీ పంచవటి క్షేత్రం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారుల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధిపనులు చేపడుతున్నామని అన్నారు.
నిర్మాణపనులలో నాణ్యతను పాటించే మాదిరిగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. షఫీనగర్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, డెడ్ ఎండ్ ప్రాంతాలలో ర్యాంపు మెట్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, అమీనుద్దీన్, వంశీముదిరాజ్, ఉస్మాన్, మారుతిప్రసాద్, ఇబ్రహీం, భాగ్యనందరావు, ఆదినారాయణ, హరీష్, సంపత్యాదవ్, బాలకృష్ణ, నర్సింగ్రావు, దినేష్, సందీప్, లక్ష్మణ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.