ఉప్పల్, జనవరి 29 : మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని ఆలేరు, యాదగురిగుట్ట ఎన్నికల ఇన్చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్రెడ్డి నివాసంలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మున్నిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు కష్టపడి పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలు గల్లి గల్లీకి తీసుకెళ్లాలన్నారఉ. బూత్ స్ధాయి నుంచి మున్సిపల్ స్ధాయి వరకు బలమైన వ్యూహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.