నాచారం, ఫిభ్రవరి9 : త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. నాచారం డివిజన్లో రూ.4.66 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ శాంతితో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హెచ్ఎంటీ నగర్ డివిజన్ లో రూ. 70 లక్షల వ్యయంతో సిసి రోడ్డు అభివృద్ది పనులు, రూ. 30 లక్షలతో అన్నపూర్ణ కాలనీలో సీసీ రోడ్డు పనులు, రూ. 34 లక్షల వ్యయంతో రాఘవేంద్ర నగర్ జాన్సన్ గ్రామర్ స్కూల్ లైన్ లో సీసీ రోడ్డు అభివృద్ది పనులు, రూ. 68 లక్షల వ్యయంతో విఎస్టి కాలనీ పార్క్ వద్ద ఓపెన్ జిమ్ వంటి పలు అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సూరజ్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, వివిధ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.