కాప్రా, మార్చి 12 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కాప్రాడివిజన్ పరిధిలోని తిరుమల శివపురికాలనీలో రూ.1 కోటి 48 లక్షల 50వేల వ్యయంతో చేపట్టే బీ.టీ. రోడ్డు నిర్మాణం పనులు, శాలివాహన కాలనీలో రూ.95లక్షల వ్యయంతో చేపట్టే భూగర్భడ్రైనేజీ పనులు, సీఎస్ నగర్లో రూ.30లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణం పనుల (మొత్తం రూ.2కోట్ల73లక్షల యాభైవేలు)కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను దశల వారీగా పరిష్కరించి, ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రాడివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు బైరి నవీన్గౌడ్, డీఈఈ బాలకృష్ణ, ఏఈ స్రవంతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బద్రుద్దీన్, బైరి భాస్కర్గౌడ్, ఇంద్రయ్య, గిల్బర్ట్, రవీందర్రావు, యు.శ్రీనివాస్, సీఎస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురాంరెడ్డి, ఆయా కాలనీల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.